ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఐటీ సేవల్లో నాణ్యత పెంచండి: ప్రేమ్‌జీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐటీ సేవల్లో నాణ్యత పెంచండి: ప్రేమ్‌జీ
అంతర్జాతీయంగా ఐటీ రంగంలో పోటీ బాగా పెరిగిన ప్రస్తుత తరుణంలో దేశీయ కంపెనీలు ఐటీ సేవల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఐటీ సేవలను తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని చెప్పుకోవడం తనకు ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

బెంగుళూరులో సీఐఐ ఏర్పాటు చేసిన ఐదో ఇన్నోవేషన్ సమిట్ 2009 సమావేశంలో ప్రేమ్‌జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ సేవలకు సంబంధించి భారత్‌కు క్రమంగా పోటీ పెరుగుతోందన్నారు. ఒకప్పుడు భారత బీపీఓ ఎగుమతుల్లో 10శాతం కూడా ఉండని ఫిలిప్పీన్స్ ప్రస్తుతం దాదాపు భారత స్థాయి ఎగుమతులను అందిస్తోందని అన్నారు.

ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు ఐటీ సేవలకు సంబంధించి భారత్‌కు ఉన్న పోటీని అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అదేసమయంలో దేశంలో కొత్తగా ఐటీ ఇంజినీరింగ్ పూర్తిచేసి బయటకు వచ్చినవారి భవిష్యత్ మరీఅంత అందంగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఐటీ విద్య పూర్తిచేసిన వారిలో దాదాపు 80శాతం మంది నిరుద్యోగులుగా ఉండిపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పారిశ్రామిక వృద్ధి రేటు 1.4 శాతంగా నమోదు
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
మాంద్యంలోకూడా ఆన్‌లైన్ అమ్మకాలు...!
2009-10లో 1.3 మిలియన్ ఉద్యోగాలకు గండి
విమాన ప్రయాణఛార్జీలు తగ్గించనున్న ఏఐ
1.4% పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం