భెల్ సంస్థ ఐఓసీ సంస్థనుంచి దాదాపు రూ. 105 కోట్ల కాంట్రాక్ట్ను పొందింది.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(ఐఓసీ) నుంచి రూ. 105 కోట్ల కాంట్రాక్ట్ను భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) సంస్థ పొందింది. ఈ సంస్థపొందిన కాంట్రాక్ట్ ద్వారా బారువానీ రిఫైనరీలో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ఉపకరిస్తుంది.
ఇక్కడ ఏర్పాటు చేయబోయే పవర్ ప్లాంట్లో ఇరవై మెగావాట్ల స్టీమ్ టర్బైన్ జెనరేటర్(ఎస్టీజీ) ను ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనిని గంటకు 150 టన్నుల సామర్థ్యంమేరకు ఉత్పత్తిని సాధించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఉత్పత్తులను భెల్ సంస్థకు చెందిన హైదరాబాద్, తిరుచ్చిరాపల్లి, రాణిపేట, భోపాల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డివిజన్, బెంగళూరు సంస్థలకు అందజేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. |