ఢిల్లీలోని సరాఫా మార్కెట్లో గురువారం ఏకంగా బంగారం ధర రూ. 330లకు పెరిగింది.అమెరికా షేర్ మార్కెట్లో వచ్చిన మార్పుల కారణంగా అక్కడ బంగారం ధరలు పెరిగాయి. దీంతో దేశీయ బంగారం ధరలలోకూడా పెరుగుదల కనపడి ఏకంగా రూ. 330లు పెరిగి ప్రతి పది గ్రాములకు రూ. 14890లుగా నమోదైంది. షేర్ మార్కెట్ల తీవ్రమైన ప్రభావంతో అమెరికాలో బంగారం ధర ప్రతి ఔన్సుకు 942 డాలర్లకు పెరింగింది. దీంతో భారతదేశంలోకూడా బంగారం ధరల్లో ఏకంగా రూ. 330లు పెరిగి ప్రతి పది గ్రాములు రూ. 14890లకు చేరుకుంది. దేశీయ మార్కెట్లో స్టాండర్డ్ బంగారం ధర రూ. 330లు పెరిగి క్రమంగా ప్రతి పది గ్రాములకు రూ. 14890 మరియు రూ. 14740ల వద్ద ఆగిపోయింది. ఇదిలావుండగా వెండి ధరల్లో రూ. 50లు పెరిగి కిలో రూ. 22500లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. |