ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దేశంలోని పరిశ్రమలు వడ్డీరేట్లను తగ్గించమని బ్యాంకులకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 28వ తేదీన ద్రవ్యనిధి పథకం మొదటి త్రైమాసిక పరిశీలనతో ముందుకు వస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బిఐ) తెలిపింది. జులై నెల 28వ తేదీన ద్రవ్యనిధి పథకం తొలి త్రైమాసిక సమీక్షను విడుదల చేస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావ్ తెలిపారు. ముంబైలోని ఆర్బిఐ ప్రధాన కార్యాలయంలో కమర్షియల్ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ల సమావేశం వచ్చే నెల 28వ తేదీన జరుగుతుందని ఆ సమావేశంలో తాము సమీక్ష వివరాలను ప్రకటిస్తామని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. |