భారత ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్లో ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల రేట్లను పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ అకౌంటింగ్, కన్సల్టింగ్ సంస్థ డెలోయిట్ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత వస్తువుల, సేవల పన్నుతో సమానస్థాయికి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల రేట్లు ప్రభుత్వం పెంచనుంది.
అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో మూడు ఉద్దీపన పథకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని ఆరు శాతానికి, సేవల పన్నును రెండు శాతానికి తగ్గించింది. తాజా బడ్జెట్లో వీటిని తిరిగి కొద్ది మేర పెంచే అవకాశం ఉందని డెలోయిట్ అభిప్రాయపడింది. అంతేకాకుండా డిసెంబరు ఉద్దీపన ప్యాకేజీలో ప్రకటించిన పరోక్ష పన్నుల తగ్గింపును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకునే వీలుందని పేర్కొంది. |