ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీపీసీ బిహెచ్ఇఎల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వరించింది. ప్రతిపాదిత ఎన్బిపిపిపిఎల్ ప్రాజెక్టు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో 750 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
బీహెచ్ఇఎల్-ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది.
దీనికి ప్రధాని మన్మోహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలు సంయుక్తంగా కలిసి శ్రీకాళహస్తిలో మండలంలోని మన్నవరంలో జులైనెలలో ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇదిలావుండగా ఈ ప్రాజెక్టు కోసం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. తీరా, ప్రతిపాదిత ప్రాజెక్టు విషయంలో అప్పటికే ప్రధాని మన్మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో రాజస్థాన్ బరి నుంచి తప్పుకుంది. |