వడ్డీలలో కోత విధిస్తున్నట్లు సంకేతాలను ఇచ్చిన దేశీయ వివిధ బ్యాంకులలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ ఉషా థోరాట్ తెలిపారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకులన్నీకూడా తాము ఇచ్చే వడ్డీ రేట్లను కుదించిన మాట వాస్తవమేనని, ఇందులో అన్ని బ్యాంకులూ పాటించే మార్గదర్శకాలలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న నెల జులై 28వ తేదీన త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా దేశీయ బ్యాంకులు వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వివిధ బ్యాంకులు రూపొందించే ప్రణాళికలలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. |