రానున్న రెండు సంవత్సరాలలో హర్యానాలో అవసరానికి మించి విద్యుదుత్పత్తిని సాధిస్తామని ఆ రాష్ట్రముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తిలో మరింత చొరవ చూపించి వృద్ధిబాటలో పయనిస్తుందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రెండు సంవత్సరాలలో తమ రాష్ట్రంవిద్యుత్ ఉత్పత్తిలో ముందుండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలనికూడా ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.
ఇదిలావుండగా రాష్ట్రంలోని గుర్గాంవ్, ఫరీదాబాద్ ప్రాంతాలలోనున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మరింత మెరుగుపరచి అభివృద్ధి చేయాల్సి ఉందని, దీనిని త్వరలోనే అభివృద్ధిపరచి విద్యుదుత్పత్తిలో మరింత అభివృద్ధిని సాధిస్తామని ఆయన తెలిపారు. |