లోక్సభలో జులైనెల 3వ తేదీన ప్రవేశపెట్టబోయే రైల్వేబడ్జెట్ ప్రజల బడ్జెట్గా ఉంటుందని ఆ శాఖామంత్రిణి మమతా బెనర్జీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్పై చర్చించడానికి అమె వివిధ రాజకీయ నాయకులతో సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ... తాము ప్రవేశ పెట్టబోయే ఈ బడ్జెట్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చేదిగా ఉంటుందని అన్నారు. బడ్జెట్లో కోరికలు చాలానే ఉన్నాయని, కాని ప్రస్తుతం తాము ప్రవేశపెట్టబోయే బడ్జెట్ను రూపొందించేందుకు పక్షం రోజుల సమయం లభించిందని దీంతో తమ శాఖాధికారులు కసరత్తు చేసారని ఆమె తెలిపారు. తాము రూపొందించిన బడ్జెట్లో రైల్వేశాఖకు కావలసినవిధంగా తయారుచేసామని ఆమె తెలిపారు. |