దేశంలో మరోమారు పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి మురళీదేవరా ప్రకటించారు. పెట్రోలు లీటర్కి రూ.4, డీజిల్పై రూ.2 పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. పెంచిన ధరలు బుధవారం అర్థరాత్రినుంచే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు. అంతకు ముందు దేవరా, ప్రధాన మంత్రితో భేటీ అయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో పెట్రో ధరలు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే వంటగ్యాస్, కిరోసిన్ ధరలు మాత్రం పెంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరల కారణంగా లోటును పూర్తి చేసుకునేందుకే తాము ధరలను పెంచాల్సివచ్చిందని ఆయన వివరించారు. |