ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన మంత్రి ప్రణబ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన మంత్రి ప్రణబ్
FILE
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారంనుంచి ప్రారంభమయ్యాయి. నిరుడు ఆర్థిక సంవత్సరం(2008-09)కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ తొలిరోజున లోక్‌సభకు సమర్పించారు.

ఇదిలావుండగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ నెల ఆరవ తేదీన ప్రవేశపెట్టనున్నారు. కాగా మూడవ తేదీన రైల్వేశాఖామంత్రిణి మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే పెరిగిన పెట్రోలు ధరలు, లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికపై అధికార, విపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు.

** ఆర్థిక సర్వే 2009 ప్రధానాంశాలు

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో గురువారంనాడు ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. అందులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి...

** నిరుడు ఆర్థిక సంవత్సరం(2008-09)లో ఆర్థిక వృద్ధిలో తగ్గుదల కనపడి 6.7శాతానికి చేరుకుంది. అదే గత ఆర్థిక సంవత్సరంలో 9శాతంగా ఉండింది.

** నిరుడు ఆర్థిక సంవత్సరం(2008-09)లో కేంద్ర ఖజానా లోటు 6శాతానికి పెరిగింది. అదే గత ఆర్థిక సంవత్సరంలో లోటు 2.7శాతంగా ఉండింది.

** పన్నుల్లో కోతతోపాటు ఇతర ఆర్థిక ప్యాకేజీలలో రాయితీలు.

** నవరత్న హోదాలేని ప్రభుత్వ రంగ దిగ్గజ కంపెనీల్లోని పీఎస్‌యూలలో 5 నుంచి 10 శాతం ఈక్విటీలను అమ్మే ప్రక్రియ త్వరితంగా పూర్తి చేయడం.

**ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాల్లో కూరుకుపోయిన, గట్టున పడేయలేని కొన్ని సంస్థలను, పీఎస్‌యూలను వేలం వేసేందుకు నిర్ణయం.

** కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను కోడ్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచి అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం.

** 3జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం. వేలం వేసి వచ్చిన సొమ్మును పన్ను చట్టం పరిధిలోకి తీసుకురావడం.

** సంయుక్త కంపెనీల ఏప్రాటు , విదేశీ కంపెనీలతో జట్టు, నిర్ణీత పరిమాణంవరకు ఇతర కంపెనీల విలీనాలు, కొనుగోళ్ళ విషయాలలో సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా స్వయం ప్రతిపత్తి లభిస్తుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అమ్మకాలు తగ్గాయి : టాటా మోటార్స్
ఎగుమతులను పెంచుకునేందుకు బడ్జెట్లో రాయితీలు !
షిప్పింగ్ ప్రాజెక్టులకు రూ.3300 కోట్ల నిధులు
మార్కెట్లో కోడిగుడ్లు ధరలు
అమ్మకాలు పెరిగిన హీరో హోండా
మళ్ళీ పెరిగిన పెట్రోలు ధరలు