ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలలోపు ఎస్ బ్యాంక్ 5 వందల కోట్ల రూపాయలను సమకూర్చనుంది. ఎస్ బ్యాంక్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోపు 5 వందల కోట్ల రూపాయలను సమకూర్చేందుకు ప్రణాళికలను రూపొందించిందని ఆ బ్యాంక్ ప్రధాన కార్యనిర్వహణాధికారి మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్ తెలిపారు. రానున్న మూడు నాలుగు నెలల్లో హైబ్రీడ్ టియర్ 1 మరియు టియర్ 2ద్వారా బ్యాంక్ 5వందల కోట్ల రూపాయలను సమకూర్చనుందని ఆయన వివరించారు. తమ బ్యాంక్ వద్ద సహాయ నిధుల అవసరాలు దాదాపు 16.6శాతం మేరకున్ననాయని, కొత్తగా నిధులను సమకూర్చిన తర్వాత సీఏఆర్ మరింత పెరగగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. |