ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > నేడు విత్తమంత్రి ప్రణబ్ "పద్దుల చిట్టా" వెల్లడి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేడు విత్తమంత్రి ప్రణబ్ "పద్దుల చిట్టా" వెల్లడి
2009-10 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్‌ను కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై పలు రాష్ట్రాలు గంపెడు ఆశలు పెట్టుకుని ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా కొత్త బడ్జెట్లో కేటాయింపులు చోటు చేసుకుంటాయని ఆశిస్తున్నాయి.

సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రతుల చిట్టా విప్పుతారు. బడ్జెట్‌ను దాఖలు చేయడంలో ప్రత్యేక అనుభవం గడించిన ఈ రాజకీయ కురువృద్ధుడు.. తాజా బడ్జెట్‌ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసి ఉంటారని ఆర్థిక నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

గత ఫిబ్రవరి ఆఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రణబ్.. ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సంస్కరణల యుగంలో ప్రణబ్ ఎలా బడ్జెట్‌ను రూపొందించారన్నదే ప్రస్తుతం అందరిని ఆలోచింపజేస్తున్న ప్రధాన అంశం.

ముఖ్యంగా, వచ్చే బడ్జెట్ ప్రజారంజకంగా ఉంటుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఇప్పటికే దేశ ప్రజలకు భరోసా ఇచ్చిన విషయం తెల్సిందే. మొత్తం మీద ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్‌పై దేశ ప్రజలతో పాటు.. పారిశ్రామికరంగం గంపెడు ఆశలు పెట్టుకుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జూన్‌లో తగ్గిన అశోక్ లేలాండ్ అమ్మకాలు
ప్రస్తుత ఏడాదికూడా పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీ
మార్కెట్లో కోడిగుడ్లు ధరలు
గేట్స్ ఫౌండేషన్‌కు దానం చేసిన వారెన్
రేపే అమ్‌ ఆద్మీ బడ్జెట్‌
జాతీయ స్థూల ఉత్పత్తి 6.7 శాతం తగ్గుదల