సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » చక్కెర ధరలను అదుపు చేయండి : సోనియా (Sonia | Letter | AICC | President | Sarad Pawar | Sugar | Price | Hike)
 
FILE
చక్కెర ధరలను అదుపు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కేంద్ర వ్యవసాయ శాఖామంత్రికి లేఖ రాశారు.

దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె చక్కెర ధరలను నియంత్రించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్‌కు ఓ లేఖ రాశారు.

గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా చక్కెర ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటూ, దీనిని నియంత్రించాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. చక్కెర దేశంలోని ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువని, కాబట్టి చక్కెర ధరలను నియంత్రించే మార్గం ఆలోచించి ధరలను అదుపు చేయాలని ఆమె తన లేఖలో సూచించారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.