దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజమైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికాంతానికి 5.67శాతం నికర లాభాలను వృద్ధి చేసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ నికర లాభాలు 5.67 శాతం పైకెగసి రూ. 1,295 కోట్లకు చేరుకుందని బుధవారం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపింది.
నిరుడు ఇదే కాలానికి తమ కంపెనీకి వచ్చిన నికర ఆదాయంతో పోలిస్తే 18.5 శాతం వృద్ధిచెంది రూ. 300.75 కోట్లకు చేరుకుందని కంపెనీ పేర్కొంది.
ఫారెక్స్ నష్టాలలో రూ. 151 కోట్ల రూపాయలుగా ఉండిందని, అదే నిరుడు ఇదే కాలానికి రూ. 80 కోట్లుగా ఉండిందని కంపెనీ తెలిపింది.