ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పైలెట్లు మరోసారి సమ్మె చేస్తామని బుధవారంనాడు సంస్థకు హెచ్చరికలు జారీ చేశారు.
దేశీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన పైలెట్లు దాదాపు 700 మంది సమ్మెకు దిగుతామని బుధవారం సంస్థకు తెలిపారు.
వివరాలలోకి వెళితే...వచ్చే నవంబర్ ఒకటవ తేదీ లోపు పైలట్లకు రావలసిన ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు చెందిన అరియర్స్ ఇవ్వకుంటే నవంబర్ నెల 1 నుంచి సమ్మెకు దిగుతామని ఏఐ సంస్థకు చెందిన పైలెట్లు హెచ్చరించారు.