దేశంలో విద్యుత్ ఉత్పత్తిని అందిస్తున్న ప్రముఖ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ సంస్థకు ఎట్టిపరిస్థితుల్లోను నష్టం వాటిల్లదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత ఐదు సంవత్సరాలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ నుండి నిర్ధారించిన ధరలతో సహజవాయువును కొనుగోలు చేస్తున్నాకూడా ఆర్థిక పరంగా నష్టం వాటిల్లదని మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం ఎన్టీపీసీ 2.34 డాలర్లకు (ఎమ్ఎమ్బీటీయూ) గ్యాస్ను కొనుగోలు చేసినా కూడా పెరిగిన ధరలను వినియోదారులపై వేయక తప్పదని, ఎందుకంటే 2003 పవర్ చట్టాన్ననుసరించి వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించక తప్పదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.