దేశీయ హిందూజా సంస్థలకు చెందిన గల్ఫ్ ఆయిల్ లాభాలబాటలో పయనించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి తమ సంస్థ రూ. 12.28 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని గల్ఫ్ ఆయిల్ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపింది.
అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సంస్థ నష్టాల్లో ఉండిందని, ఆ మొత్తం రూ. 98 లక్షలుగా పేర్కొంది.
గడచిన త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ. 228.75 కోట్లకు చేరుకుంది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 225.99 కోట్లుగా ఉండిందని సంస్థ తెలిపింది.