దేశంలో నెలకొన్న కరవు, వరదల కారణంగా పంట అందకపోయేసరికి బియ్యం దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో ధరలు ఆకాసాన్నంటడంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి 30 వేల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోనుంది.
దేశంలోని ప్రధాన అమ్మకందార్లైన ఎమ్ఎమ్టీసీ, ఎస్ఈసీ, పీఈసీలనుంచి పది వేల టన్నుల ప్రత్యేకరకమైన బియ్యాన్ని దిగుమతి చేసుకుని మార్కెట్లో అమ్మాలని కేంద్ర ప్రభుత్వం వారికి సూచించింది.
దీంతో ఈ మూడు కంపెనీలు డిసెంబర్ నాటికి బియ్యం దిగుమతి చేసుకునేందుకు శుక్రవారం టెండర్ వేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మిగిలిన ఇరవై వేల టన్నుల బియ్యానికి ప్రభుత్వం వేరే మార్గాలను అన్వేషిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.