స్కోడా ఆటో ఇండియా సంస్థకు చెందిన కార్ల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలోని అక్టోబర్ నెలకు దాదాపు 98 శాతం పెరిగి 1753 వాహనాలు అమ్ముడుపోయాయి.
అదే నిరుడు ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెలకు స్కోడా కార్లు కేవలం 887 వాహనాలే అమ్ముడైనాయని కంపెనీ డైరెక్టర్ల మండలి సభ్యుడు యామస్ కుయేల్ తెలిపారు.
గత మూడు నెలల కాలంలో కంపెనీ వాహనాల అమ్మకాలలో 58 శాతం వృద్ధి జరిగిందని, అదే అక్టోబర్ నెలలో 336 వాహనాలు అమ్ముడైనట్లు ఆయన వివరించారు.