ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం తొలి నెల అక్టోబర్లో తమ సంస్థకు చెందిన అమ్మకాలలో 57 శాతం వృద్ధి సాధించిందని అశోక్ లేలాండ్ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కు బుధవారం తెలిపింది.
తమ సంస్థకు చెందిన వాహనాల అమ్మకాలలో వృద్ధి సాధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెలలో 56.99 శాతానికి చేరుకుని 5,333 వాహనాలు అమ్ముడుపోయాయని కంపెనీ వెల్లడించింది.
నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి జరిగిన అమ్మకాలతో పోలిస్తే 421 వాహనాలు ఎక్కువగా అముడైనట్లు సంస్థ తెలిపింది.