ప్రపంచవ్యాప్తంగా స్టీల్ మార్కెట్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా టాటా స్టీల్స్ సంస్థ స్టీల్ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
సిఐఐ స్టీల్ సమావేశం సందర్భంగా టాటా సంస్థలకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఎమ్ నేరూర్కర్ మాట్లాడుతూ... తాము తమ స్టీల్ ఉత్పత్తుల ధరలను తగ్గించామన్నారు. ప్రపంచంలోని స్టీల్ మార్కెట్లో ధరలలో తగ్గుదల వచ్చిన కారణంగా తాము ఇతర దేశీయ కంపెనీల మాదిరిగానే ధరలు తగ్గించామని ఆయన అన్నారు
దేశంలోని సెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్సార్, ఇస్పాత్ ఇండస్ట్రీస్ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను మంగళవారం నాడు ప్రతి టన్నుకు రూ. 1,500ల మేరకు తగ్గించాయి. దీంతో తాము కూడా తగ్గించామని ఆయన వివరించారు. ఇదివరకు దేశంలోని అన్ని కంపెనీలు సెప్టెంబర్ నెలలో రూ. 1,500లు పెంచాయని ఆయన తెలిపారు.