పెరిగిన ముడి చమురు ధరలు

శుక్రవారం, 6 నవంబర్ 2009( 13:11 IST )
ముడి చమురు ధరలు ప్రతి బ్యారెల్కు 80 డాలర్లకు చేరుకుంది.
డిసెంబర్ నెలలో డెలివరీకి సిద్ధంగానున్న ముడి చమురు ఏకంగా 47 సెంట్లు పెరిగి ప్రతి బ్యారెల్ ధర 80.09 డాలర్లకు చేరుకుందని న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్ఛేంజ్ శుక్రవారం వెల్లడించింది.
శుక్రవారం ఉదయాత్పూర్వానికి ముందుగానే ఆసియాకు చెందిన అన్ని మేజర్ దేశాలలో ముడి చమురు ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం తాము మార్కెట్ పరిస్థితిని అంచనా వేస్తున్నామని, అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణులు తెలిపారు. వచ్చే ఏడాదికి ఈ ధర మరింత పెరగనుందని వారు పేర్కొన్నారు.
దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు వచ్చే ఏడాదికి ప్రతి బ్యారెల్ ధర 85 డాలర్లకు చేరుకుంటుందని అమెరికాకు చెందిన కన్స్యూమర్ నిపుణుడు మోర్గాన్ స్టాన్లీ తెలిపారు.