దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్ని పెట్టుబడులపై వడ్డీ రేట్లను తగ్గించింది. అది 0.25 నుంచి 0.5 శాతం వడ్డీని తగ్గించిందని శుక్రవారం ప్రకటించింది.
తాము తగ్గించిన ఈ వడ్డీ రేట్లు సోమవారం(9.11.09)నుంచి అమలులోకి వస్తాయని పీఎన్బీ వెల్లడించింది.
పెట్టుబడి పెట్టే తమ ఖాతాదారులకు మూడు సంవత్సరాలు, ఆ పై కాలానికి పెట్టుబడులు పెట్టేవారికి 7 శాతం వడ్డీని ఇస్తామని బ్యాంక్ ప్రకటించింది. అలాగే వయోవృద్ధులకు అదనంగా 0.5 శాతం వడ్డీని తమ బ్యాంక్ ఇవ్వనున్నట్లు బ్యాంక్ తెలిపింది.