బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. రానున్న దీపావళి నాటికి బంగారం ధరలు పది గ్రాములకు గానూ రూ. 19,500 నుంచి రూ. 20,000లకు చేరే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.
"ఈ సంవత్సరం ధరలలో కొన్ని మార్పుల తర్వాత దిపావళి నాటికి బంగారం ధరలు పది గ్రాములకు గానూ రూ. 19,500 నుంచి రూ. 20,000లకు చేరుతాయని మేము అంచనా వేస్తున్నాం" అని బొంబాయి బులియన్ అస్సోసియేషన్ (బీబీఏ) అధ్యక్షుడు సురేష్ హుండియా తెలిపారు.
గత వారం స్టాండర్డ్ బంగారం (99.5 స్వచ్ఛత) రూ. 18,910 వద్ద ముగియగా, స్వచ్ఛమైన బంగారం (99.9 స్వచ్ఛత) రూ. 19,000 వద్ద ముగిసింది.