దేశీయ మొబైల్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న "నోకియా" మొదటిసారిగా రెండు "డ్యూయల్ సిమ్ కార్డ్" మొబైల్ ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. ఇప్పటికే పలు చిన్న కంపెనీలు ఇటువంటి సదుపాయాలు ఉన్న ఫోన్లను చవక ధరకే అందిస్తున్న నేపథ్యంలో నోకియా ఈ విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా ఈ మోడళ్లను సిద్ధం చేసింది.
నోకియా సీ1 (సీ1-100), నోకియా సీ2 పేర్లతో నోకియా నూతన ఫోన్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో సీ1 ధర రూ. 1,999గా ఉన్నట్లు తెలిపింది. ఈ ఫోన్లో ఫ్లాష్లైట్, ఎఫ్ఎమ్ రేడియో, కాల్డైవర్ట్ వంటి సదుపాయాలున్నాయి. అయితే సీ2 మోడల్ కోసం మాత్రం ఈ ఏడాది చివరి వరకూ వేచి చూడాల్సిందే.
భారత్లోనే సర్వర్ ఏర్పాటు చేస్తాం..! ప్రస్తుతం భారత్కు పెద్ద తలనొప్పిగా మారిన కెనడా మొబైల్ సంస్థ బ్లాక్బెర్రీ సమస్యను దృష్టిలో ఉంచుకొని నోకియా తమ సర్వర్ను భారత్లోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషంయలో నోకియా తీసుకున్న నిర్ణయం బ్లాక్బెర్రీపై ఒత్తిడిని మరింత పెంచే అవకాశం ఉంది. అయితే బ్లాక్బెర్రీ సేవలను ప్రభుత్వం పర్యవేక్షించడానికి బ్లాక్బెర్రీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.