ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీస్ఎన్ఎల్) అండమాన్ నికోబార్ దీవుల్లో సీడీఎంఏ ఫోన్ల కోసం ఉద్దేశించిన మొబైల్ స్విచ్ఛింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ దీవుల్లోని 63 స్టేషన్లను కలుపుతూ 50వేల లైన్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చీఫ్ జనరల్ మేనేజర్ అతాను ఘోష్ తెలిపారు.
ఈ కొత్త కేంద్రాన్ని 13.25 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రం ఎస్ఎంఎస్, వాయిస్ మెయిల్, ఇంటర్నెట్ ఆధారిత, ప్రీపెయిడ్ తదితర సేవలను అందిస్తుందని ఘోష్ అన్నారు.
|