కేరళలో అన్ని జిల్లాల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సుమారు లక్షకు పైగా ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయని.. రాష్ట్రహోం మంత్రి కొడియేరి బాలక్రిష్ణన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీలో తెలియపరిచారు.
తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళి సిద్ధం చేసిందని.. అసెంబ్లీలో సీపీఐ నేత ఎన్ అనిరుద్ధన్ మరియు ఇతరులు అడిగిన ఓ ప్రశ్నకు బాలకృష్ణన్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఐటీ రంగంలో మరో మూడేళ్లలో లక్షకుపైగా ఉపాధి అవకాశాలను కల్పించనున్న కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (కేఎస్ఐటీఐ) ప్రాజెక్టును ఇప్పటికే ప్రభుత్వం ఆచరణలో పెట్టిందని.. ఆ రాష్ట్రముఖ్యమంత్రి తరుపు ప్రతినిధిగా బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఐటీ పార్కుల ఏర్పాటులో అన్ని జిల్లాల నుంచి తమకు సలహాలు, సూచనలు వచ్చాయని... అలాంటివి మరిన్ని తమకు అందజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
|