దేశంలోనే తొలిసారిగా స్వదేశీ సెమీకండక్టర్ పరిశోధనా కేంద్రం, చిప్ డిజైనింగ్ హబ్ కోల్కతాలో స్థాపించనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.100 కోట్లతో నెలకొల్పనున్నారు. ఇండియా డిజైన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో నెలకొల్పబోతున్న ఈ కేంద్రానికి పశ్చిమ బెంగాల్ సమాచార శాఖా మంత్రి డాక్టర్ దేబేష్ దాస్ మంగళవారం శంఖుస్థాపన చేశారు.
కోల్కతాలోని సాల్ట్ లేక్ ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్లో 1.7 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ పరిశోధనా కేంద్రం 20 అంతస్తులు కలిగి ఉంటుంది. మొత్తం వైశాల్యం 250,000 చదరపు అడుగులు. రూపకల్పనకు, టెస్టింగ్కు, నమూనా తయారీకి తగిన వసతులను ఇండియా డిజైన్ సెంటర్ సెమీకండక్టర్ చిప్ కలిగి ఉంది. వచ్చే 2009 నాటికి ఈ కేంద్రం నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి దాస్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన కాన్సెప్ట్ నోట్ను ఖర్గపూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించిందని మంత్రి దాస్ వివరించారు.
|