జపాన్ మినహా మిగిలిన ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో 2008లో మొబైల్ వాడకం సుమారు 400మిలియన్లకు పైగా పెరుగనున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. పదిశాతానికి పైగా వార్షిక పెరుగుదల ఉండే అవకాశాలున్నట్లు ఈ నివేదికలు తెలుపుతున్నాయి.
ఈ నివేదికల ప్రకారం ముఖ్యంగా భారత్, చైనా తదితర దేశాల్లో ఈ వృద్ధి రేటు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2007లో మొత్తం 366 మిలియన్ యూనిట్ల విక్రయం జరుగినట్లు ఐడీసీ తన నివేదికలో తెలిపింది. ఇందులో అరవైశాతం భారత్, చైనాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ ఏడాది ఇరు దేశాల్లో మొబైల్ రంగం అరవైశాతం డిమాండ్ ఉందని... ఈ లెక్కల ప్రకారం మొబైల్ రంగం త్వరితగతిన విస్తృతంగా విస్తరించగలదని ఈ అంశంపై పరిశోధించిన సంస్థ అభిప్రాయ పడింది.
|