వినియోగదారులకు టెలీ ఎడ్యుకేషన్ సేవలను అందిస్తామని ప్రభుత్వ రంగ టెలికాం ధిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తెలిపింది. తమ నుంచి ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సేవలు పొందుతున్నవారికి ఈ అవకాశం కలుగుతుందని బీఎస్ఎన్ఎల్ ఉత్తర ప్రదేశ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ చెప్పారు.
ఢిల్లీ ప్రాంతంలో టెలీ ఎడ్యుకేషన్ సేవలను ప్రారంభించాలని బీఎస్ఎన్ఎల్ ఇటీవలే నిర్ణయం తీసుకుందని వివరించారు. తద్వారా విద్యా కార్యక్రమాలతో పాటుగా స్టడీ మెటీరియల్ తమ వినియోగదారులు పొందుతారని తెలిపారు. ఈ సేవలను పొందటానికి వినియోగదారులు నెలకు రూ.250లు చెల్లించాలని కుమార్ వెల్లడించారు.
ప్రభుత్వ రంగ టెలికాం ధిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా విస్తృతంగా నెట్వర్క్ కలిగి ఉంది. వినియోగదారులకు కావలిసిన అనేక సేవలను బీఎస్ఎన్ఎల్ సకాలంలో అందిస్తూ వారి మన్ననలను పొందుతుంది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో టెలికాం టవర్లను బీఎస్ఎన్ఎల్ కలిగిఉంది.
|