ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన మొబైల్ లైఫ్టైమ్ వినియోగదారుల కోసం ఓ సరికొత్త ఆఫర్ను "లైఫ్టైమ్ జాదూ" అనే పేరుతో ప్రవేశపెట్టింది. కొత్తగా లైఫ్టైమ్ కనెక్షన్లు తీసుకునే వారు, ఇప్పటికే రిలయన్స్ లైఫ్టైమ్ను వాడుతున్నవారు సైతం ఈ జాదు ఆఫర్ను ఉపయోగించుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.ఈ జాదు ఆఫర్ ప్రకారం... లైఫ్టైమ్ వినియోగదారులు లోకల్ కాల్ను నిమిషానికి యాభై పైసలు, దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకైనా ఎస్టీడీ ఛార్జీ నిమిషానికి ఒక్క రూపాయి చొప్పున కాల్ చేసుకోవచ్చు. కాగా, ఈ సరికొత్త లైఫ్టైమ్ జాదూ ప్యాకేజీ 550 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.ఇదిలా ఉంటే... గతంలో లైఫ్టైమ్ కనెక్షన్ను రిలయన్స్ మొబైల్ 199 రూపాయలకే విడుదల చేసింది. ప్రస్తుతం ప్రకటించిన ధరల శ్రేణిలో కాల్స్ చేసుకునేందుకు ప్రతినెలా కొత్త ఓచర్లను కొనుగోలు చేయాల్సి వచ్చేది. అయితే ఇకపై ఆ అవసరం ఉండబోదని, ఒకేసారి ఈ 550 రూపాయల ఓచర్ను కొనుగోలు చేసినట్లయితే... లైఫ్టైమ్దాకా ఇదే ఆఫర్ వర్తిస్తుందని రిలయన్స్ వెల్లడించింది. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |