నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి కృష్ణయాదవ్కు కొంత మేరకు ఊరట లభించింది. ఆయనపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం (మోకా) కింద నమోదు చేసిన వివిధ కేసులను పూణే ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది.
అయితే.. దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే చట్టం కింద మాత్రం యాదవ్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యాదవ్ మాట్లాడుతూ.. మోకా చట్టం కింద తనపై కేసు నమోదు చేయడం చెల్లదని ఆది నుంచి వాదిస్తూ వచ్చానని, ఇపుడు అదే రుజువైందన్నారు.
|