ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
వచ్చే సెప్టెంబర్ నుంచి ఓటరు గుర్తిపు కార్డుల ప్రక్రియ
వచ్చే సెప్టెంబర్ నెల నుంచి ఓటరు గుర్తింపు కార్డుల ప్రక్రియ ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఫొటోలు తీసి ఓటర్ల జాబితా తయారు చేయాలని మండల రెవెన్యూ కార్యాలయాలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఫొటోగ్రాఫ్‌ల స్కానింగ్, డేటా ఎంట్రీ, మార్పులు వంటి వాటిని వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు చేపట్టాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. మార్చి ఒకటో తేదీన ఓటర్ల జాబితా ప్రకటించి, అభ్యంతరాల స్వీకరణ, నమోదు, పరిశీలన వంటివి పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరుకు కొత్త ఎలక్ట్రానిక్ ఓటరు కార్డులను పంపిణీ చేయాలని సూచించింది.
మరిన్ని
కిడ్నాపుకు గురైన సత్యం కంప్యూటర్స్ జనరల్ మేనేజర్
తెదేపా ఎమ్మెల్యేల ధర్నా: అరెస్టు చేసిన పోలీసులు
బాబు మనస్తాపం చెందితే భేషరతు క్షమాపణ: వైఎస్
డిప్యూటీ స్పీకర్‌గా కుతూహలమ్మ ఏకగ్రీవ ఎన్నిక
ప్రస్తుత సమావేశాలకు హాజరుకాను: చంద్రబాబు
ముఖ్యమంత్రి వాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిరసనలు