రాష్ట్రంలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం జీడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యానులో బాసరకు వెళుతున్న నిజమాబాద్ వాసులను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. జగ్గయ్యపేట నుంచి సిమెంటు బస్తాలతో విశాఖపట్నం వెళుతున్న లారీ అదుపుతప్పి కరెంటు స్థంబాన్ని ఢీ కొనడంతో లారీపైన కూర్చున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. తెల్లవారు జామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
|