ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేడు నల్గొండ యూనివర్సిటికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి మంగళవారంనాడు నల్గొండలోని పలు ప్రాంతలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం సముద్రం, బ్రహ్మణవెల్లం ఎత్తిపోతల పథకాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
ముఖ్యమంత్రి పర్యటను పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వేల మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలో రాజమండ్రిలో నన్నయ యూనివర్సిటీ, కడపలో వేమన యూనివర్సిటీ, నల్గొండ కొత్తగా యూనివర్సిటీలు ఏర్పాటైన సంగతి విదితమే.
|