ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
తీవ్రవాదానికి 71,000 మంది బలి: సీబీఐ
గడచిన పదిసంవత్సరాల కాలంలో తీవ్రవాదం కారణంగా దేశంలో 71,000 మంది బలైపోయినట్లు కేంద్ర నేరపరిశోధక విభాగం (సీబీఐ) పోలీస్ సూపరింటెండెంట్ ఏ. సాయి మనోహర్ పేర్కొన్నారు. స్థానికంగా గల ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఆధ్వర్యంలో అకడమిక్ స్టాఫ్ కాలేజీలో "భారతదేశంలో అంతర్గత భద్రత" అనే అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

మతపరమైన మరియు ఇతర కారణాల మూలంగా కూడే జనసమూహాలను లక్ష్యంగా పెట్టుకుని తీవ్రవాదులు జనహననం సాగిస్తున్నారని మనోహర్ తెలిపారు. తద్వారా ప్రజల ప్రాణాలను హరించడమే కాక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాలలో చోటు చేసుకున్న తీవ్రవాదుల దాడులలో చనిపోయిన ప్రజల వివరాలను గణాంకాల రూపంలో మనోహర్ వెల్లడించారు.
మరిన్ని
దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్ళు
అమ్మవారి సన్నిధికి వైఎస్సార్
సీఎం పదవిని లోకాయుక్త పరిధిలోకి తేవాలి
ఆటోలకు ప్రత్యామ్నాయంగా టాక్సీలు: వైస్సార్
బ్రిటన్ టాప్‌టెన్‌లో హైదరాబాద్ యువకుడు
పేదలకు ఉచిత హెల్త్‌ కార్డులు: లోక్‌సత్తా