ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
కొల్లేటి సరస్సుకు దారి పడుతున్న పక్షులు
Birds
WD PhotoWD
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేటి సరస్సుకు వలస పక్షులు తిరిగి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని కృష్ణ, గోదావరి జిల్లాలను ఆవరించి ఉన్న మంచినీటి సరస్సుగా పేరు పొందిన కొల్లేటి సరస్సుకు పక్షుల రాక ప్రారంభమయ్యిందని కొల్లేరు అభయారణ్య నిర్వహణ విభాగం బుధవారం పేర్కొంది.

అక్టోబర్ మాసాంతానికి దక్షిణాఫ్రికాకు చెందిన పక్షులు కూడా సరస్సుకు చేరుకునే అవకాశం ఉందని డివిజినల్ అటవీ అటవీ అధికారి జి.నిరంజన్ మీడియాతో అన్నారు. సైబీరియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పక్షులు కూడా భారీ సంఖ్యలో ఇదేకాలంలో సరస్సును చేరుకుంటాయని నిరంజన్ తెలిపారు. వలస పక్షులకు చోటు కల్పించేందుకు గాను వేలసంఖ్యలో స్థానిక పక్షులు సరస్సు పరిసరాలలోని సురక్షిత ప్రాంతాలకు పయనమవుతాయని అన్నారు.

పక్షులుకు అనువుగా ఉండేందుకు గాను సరస్సు పరిసరాలలో అటవీ శాఖ 5,000 మొక్కలు నాటిందని తెలిపారు. సరస్సులో వేటను గతసంవత్సరం నిషేధించినట్లు నిరంజన్ పేర్కొన్నారు. నిషేధం అమలుకు గాను పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
మరిన్ని
రెండో ఎస్సార్సీకే కాంగ్రెస్ మొగ్గు: మొయిలీ
మంత్రి పవార్‌ను కలసిన చంద్రబాబు
వరి మద్దతు ధరపై రఘువీరా అత్యవసర భేటి
హైదరాబాద్‌కు వచ్చిన మొయిలీ: ఘనస్వాగతం
గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం: షబ్బీర్ ఆలీ
గోసంరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం