రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాస్వామ్యంతో మొత్తం 67 రూరల్ రెసిడెన్షియల్ పబ్లిక్ పాఠశాలలను నెలకొల్పనున్నారు. ఈ పాఠశాలలు నెలకొల్పే ప్రాంతాలను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిపై ప్రభుత్వ ఓ ప్రకటన విడుదల చేసింది. పాఠశాలల ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రైవేట్ సంస్థలతో ప్రాథమిక ఒప్పందాలు పూర్తయినట్టు పేర్కొంది.
ఈ పాఠశాలలు నెలకొల్పనున్న ప్రాంతాలల్లో అవసరమైన స్థలాలను కూడా ఆయా జిల్లా కలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ అంశంపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సంబంధిత పాఠశాల అధికారులతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
|