ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మొబైల్ కెమెరాలతో పోలీసుల నిఘా
FileFILE
బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా నగరంలోని పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మఫ్టీలోని పోలీసులు అసాంఘిక శక్తుల కదలికలపై గురువారం నిఘా వేశారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 'షాడో పోలీసు టీము'లను నియమించినట్లు చార్మినార్ సహాయక పోలీస్ కమీషనర్ రెడ్డన్న మీడియాతో అన్నారు.

తమ కార్యకలాపాలలో భాగంగా ద్విచక్ర వాహనంపై సంచరించే షాడో పోలీసు టీములు మొబైల్ కెమెరాల సహాయంతో అనుమానితుల కదలికలను రికార్డు చేస్తాయని రెడ్డన్న తెలిపారు. పాతబస్తీలోని ప్రతి వీధిలోను మరో ఇరవైనాలుగు గంటల పాటు విధుల నిర్వహించేలా టీములను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాక మొబైల్ కెమెరా టీములు అనుమానితుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు చేరవేస్తాయని తెలిపారు.
మరిన్ని
మెగా 'పార్టీ'పై 'మెగా' వార్తలు
మావోయిస్టు అగ్రనేత సాగర్ అరెస్టు
కొలిక్కి రాని జూనియర్ డాక్టర్ల సమ్మె
త్వరలో అన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీ పథకం: వైఎస్
ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెస్సార్
పలాస మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి