సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా 3,350 బస్సులను నడుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కే ఎస్ నాగరాజారావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి కోస్తా, రాయలసీమ మరియు తెలంగాణా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.
అదేసమయంలో నగరంలోని మహాత్మా గాంధీ బస్సు టెర్మినల్కు ప్రయాణికులు తాకిడిని నివారించేందుకు, ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల పోకలను ఇతర బస్సు టెర్మినల్లకు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణా ప్రాంతాలకు దారితీసే బస్సులను అందుకునే ప్రయాణికులు సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ మరియు మెహిదీ పట్నంను వినియోగించుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ బస్సుల కన్నా ఆర్టీసీ తక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
|