ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పేరంటాలపల్లి లాంచీల్లో "మెగా పార్టీ"పై మంతనాలు
సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తులో ఊపందుకున్నాయి. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన మెగాసోదరుడు నాగేంద్ర బాబు, బావమర్థి అల్లు అరవింద్‌లు చిరు అభిమాన సంఘాలకు చెందిన కీలక నేతలతో రహస్య మంతనాలు నిర్వహించారు. ఈ రహస్య సమావేశం కూడా రాజమండ్రి నుంచి పేరంటాలపల్లికి వెళ్ళేందుకు లాంఛీల్లో జరగడం విశేషం. దీంతో సమావేశ అంశాలు వెలుపలికి పొక్కలేదు.

అంతేకాకుండా మండల, గ్రామీణ స్థాయిల్లో చిరు అభిమాన సంఘాల పేరిట ప్రజా సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేయాలని వారు అభిమాన సంఘాల నేతలకు పిలుపునిచ్చినట్టు సమాచారం. అలాగే మండలస్థాయిలో చిరు అభిమానులపై నిఘా వ్యవస్థ ఏర్పాటు, చిరంజీవి పార్టీకి కులముద్ర పడేలా చేయడం వంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వారు అభిమానులకు పిలుపునిచ్చారు.
మరిన్ని
వైఎస్సార్ చేతిలో తెలంగాణా "కీ"
"తిరంగారన్‌"కు ముస్తాబైన కృష్ణాతీరం
ఈనెల 16న రాష్ట్ర బడ్జెట్: ఆర్థికమంత్రి రోశయ్య
రేపటి నుంచి గరీబ్‌రథ్ రైలు సేవలు
హామీలపై శ్వేత పత్రం: బాబు డిమాండ్
స్వాతంత్ర్య సమరయోధురాలు విద్యాదేవి ఇకలేరు