రాష్ట్రంలో తొలిసారిగా గరీబ్ రథ్ రైలు సేవలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభంకానున్నాయి. సికింద్రాబాద్ - యశ్వంత్పూర్ల మధ్య వారంలో మూడు రోజుల పాటు నడిచే గరీబ్ రథ్ రైలు సర్వీసును కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి (రైలు నెంబరు 2735) ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో రాత్రి 19.15 గంటలకు యశ్వంత్ పూర్కు బయలుదేరివెళుతుంది.
అలాగే.. యశ్వంత్పూర్ నుంచి (రైలు నెంబరు 2736) ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్కు ఉదయం 8.25 నిమిషాలకు వచ్చి చేరుతుంది. ఈ రైలు బేగంపేట, రాయిచూర్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్ స్టేషన్లలో ఆగి వెళుతుంది. ఈ గరీబ్ రథ్ రైలుకు 12 ఏసి 3 టయర్ కోచ్లతో పాటు రెండు పవర్ కార్ బోగీలు వుంటాయి.
|