ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మదర్‌థెరిస్సా స్ఫూర్తితో ప్రజాసేవ చేద్దాం: నాగబాబు
FILE
మదర్‌థెరిస్సా స్ఫూర్తితో చిరంజీవి అభిమానులు ప్రజాసేవకు పునరంకితులు కావాలని చిరంజీవి సోదరుడు నాగబాబు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లాలో నాగబాబు తొలిసారిగా చిరు అభిమానుల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం మొదలుకొని హనుమాన్ జంక్షన్ వరకూ పాదయాత్ర చేశారు.

మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్‌లో మదర్‌థెరిస్సా విగ్రహాన్ని ఆవిష్కరించి, అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. అనంతరం బహిరంగ సమావేశంలో అభిమానులతో మాట్లాడుతూ, మంచి పనులతో అన్నయ్య చిరంజీవికి మంచి పేరు తేవాలని కోరారు. ఆ తర్వాత గొల్లపల్లిలో జరిగిన మదర్‌థెరిస్సా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో చిరు అభిమానులు రక్తదానం చేశారు. ఈ పాదయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చిరు అభిమానులు గాయపడ్డారు.
మరిన్ని
సైన్స్ ఎక్స్‌ప్రెస్‌లో విద్యార్ధుల సందడి  
మాతృభాషకు పట్టం కట్టండి: రోశయ్య
గ్రూప్ 1, 2 దరఖాస్తుల స్వీకరణ గడుపు పొడిగింపు
ఫిబ్రవరి 23 నుంచి ఉచిత సైకాలజీ శిక్షణ
అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
మేడారం జాతరకు ఫిబ్రవరి 23న వైఎస్ రాక