విజయవాడ సమీపంలో ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం కాలువలో పడటంతో 32 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న లగ్జరీ బస్సు అదుపు తప్పడంతో గూడవల్లి వద్ద ఓ వంతనెను ఢీకొని, ఆ వెంటనే కాలువలో పడిపోయింది. ఈ సంఘటనలో గాయాలపాలైన ఆరుగురిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఓ గర్భిణి సహా ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
|