|
దేవతలారా... మము గెలిపించండి
|
|
|
|
|
శుక్రవారం, 2 మే 2008( 19:37 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | ఉపఎన్నికల వేడి ముదిరింది. నడి వేసవిని సైతం లెక్కచేయక ఆయా పార్టీల అభ్యర్థులు ఓట్ల అభ్యర్థన కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రజలను ఓట్లను అభ్యర్థించటంతోపాటు స్థానిక ప్రజల ఇలవేల్పులకు మొక్కుతున్నారు. అంతా దేవునిదే భారమంటూ ఆ దేవతలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న ప్రాంతాలోని దేవాలయాలు పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలతో కళకళలాడుతున్నాయి.
మరోవైపు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ తామే అధిక స్థానాలను గెలుచుకుంటామంటుంటే... తెరాస పార్టీ పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీలను నామరూపం లేకుండా చేస్తామని అంటోంది. తెలుగుదేశం తమవైపే ప్రజలు ఉన్నారని చెపుతోంది. ఈ నేపధ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే...
|