ఐటీ రంగ అభివృద్ధితో ఇంజనీరింగ్, ఎమ్సిఎ, ఎమ్బీఎ కోర్సులు చేసినవారిని ఉపాధి అవకాశాలు తరుముకొస్తున్నాయి. రెండుమూడేళ్ల క్రితం వరకూ "వేలకు వేలు జీతాలు" అన్నమాట తాజాగా "లక్షలకు లక్షల జీతాలు"గా మారింది. ఏడాదిపాటు ఐటీ రంగంలో కష్టపడితే చాలు... విదేశీ కంపెనీలు సదరు ఉద్యోగిని ఎగరేసుకుపోతున్నాయి. ఐటీ దాని సంబంధిత సంస్థలు అర్హతగలవారికి లక్షల్లో జీతాలను చెల్లిస్తున్నాయి.
ఐటీ రంగ పరిస్థితి ఇలా ఉంటే... ఒకప్పుడు స్టెతస్కోపును మెడపై ధరించి తెల్లని వస్త్రాలతో కనిపించే వైద్యవృత్తిపై రానురాను ఆసక్తి తగ్గిపోతోంది. దీనికి కారణం డాక్టర్ డిగ్రీ పూర్తి చేయాటానికి పట్టే సమయం... పూర్తి చేసిన తర్వాత వచ్చే ఆదాయం ఐటీ రంగ ఉద్యోగులు సంపాదించే ఉద్యోగం ముందు దిగదిడుపుగా ఉండటమే. ఫలితమే ఈ ఏడాది వైద్య కోర్సులో చేరే వారి సంఖ్య 20 వేలకు పైగా పడిపోయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. అంటే... భవిష్యత్తులో వైద్యుల కొరత ఉత్పన్నమవుతుందన్నమాట.
|