బ్రిటన్లో వైద్యవిద్య నభ్యసించేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని మంగళవారం దారుణ హత్యకు గురైంది. విజయవాడకు చెందిన జ్యోతిర్మయి (24)ని బర్మింగ్హామ్లోని ఆమె నివసిస్తున్న అద్దె అపార్ట్మెంట్లో ఎవరో దుండగులు హతమార్చారు.
యూనివర్శిటీ ఆఫ్ వోల్వర్ హాంప్టన్లో చదువుతున్న జ్యోతిర్మయి హత్యకు గురైందన్న విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆమె మృత దేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు.
ఆమెతో పాటు మరో వ్యక్తికి కూడా గాయాలైనట్టు తెలిసింది. దీంతో ఈ దిశగా దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు చుట్టు పక్కల ఇళ్ల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.
|