ఉపఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ ఆయా పార్టీలు ప్రజలకు వాగ్దానాలను గుప్పిస్తున్నాయి. వరంగల్ జిల్లా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ... తాము అధికారంలోకి వస్తే పేదలు తీసుకున్న గృహరుణాలను రద్దు చేస్తామనీ, ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామనీ హామీ ఇచ్చారు. అంతేకాదు వృద్ధులకు ఇచ్చే ఫించనును పెంచుతామని చెప్పారు.
మరోవైపు తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరరావు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారనీ, ఉప ఎన్నికలలో తెరాస ఘన విజయం ఖాయమని అంటున్నారు. కేవలం తెరాస సెంటిమెంట్నే ప్రధాన అస్త్రంగా చేసుకున్న కేసిఆర్కు తెలంగాణా జిల్లాల ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుందో చూడాలి మరి.
|