తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్సులలో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆయా కాంప్లెక్సులలో వ్యాపారం చేయటంకోసం వారు బ్యాంకులనుంచి అప్పు తీసుకున్నారు. అయితే వ్యాపారం అనుకున్నంతగా సాగకపోవటంతో బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతున్నారు.
దీంతో మరోసారి ఋణాలను బ్యాంకులు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయి. ఫలితంగా వ్యాపారులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీరేట్లకు అప్పులు తీసుకుని నెలవారీ వారికి చెల్లించాల్సిన వాయిదాలను చెల్లించలేక ఇబ్బందులపాలవుతున్నారు. బ్యాంకులనుంచి ఋణాలను మంజూరు చేయించి తమను ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.
|